తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉదయం 10 గంటల నుంచి లాక్ డౌన్ నిబంధనలు అమలులోకి వచ్చాయి.పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు కానుండగా పదిరోజుల తర్వాత పరిస్థితిని బట్టి సీఎం కేసీఆర్ లాక్ డౌన్ విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు.
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం సినిమాలపై పడినా సీరియళ్లపై మాత్రం పడలేరు.అయితే లాక్ డౌన్ రూల్స్ అమలవుతూ ఉండటంతో ఉండటంతో త్వరలో
సీరియళ్ల ప్రసారాలు
కూడా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
గతేడాది లాక్ డౌన్ నిబంధనలు అమలైన సమయంలో సీరియళ్ల షూటింగ్ లు ఆగిపోయిన సంగతి తెలిసిందే.మళ్లీ తెలంగాణలో లాక్ డౌన్ అమలవుతూ ఉండటంతో మళ్లీ షూటింగ్ లను ఆపేయాల్సిన పరిస్థితి నెలకొంది.
తెలుగులో పలు ఛానెళ్లలో ప్రసారమవుతున్న సీరియళ్లకు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.ఆ ఛానెళ్ల టీఆర్పీ రేటింగ్ ల వల్లే టీవీ ఛానెళ్లు టాప్ 3 స్థానాల్లో కొనసాగుతున్నాయి.
సీరియళ్లు, రియాలిటీ షోల ప్రసారాలు ఆగిపోవడంతో టీవీ ఛానెళ్లు మళ్లీ సినిమాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.కరోనా కేసులు తగ్గకపోతే తెలంగాణలో లాక్ డౌన్ ఆంక్షలను పొడిగించే అవకాశం ఉంది.కరోనా కేసులు తగ్గని పక్షంలో ఏపీలో కూడా లాక్ డౌన్ ఆంక్షలు అమలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.లాక్ డౌన్ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుండటం గమనార్హం.
లాక్ డౌన్ ప్రభావం టీవీ రంగంపై భారీగా పడబోతుందని తెలుస్తోంది.ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఎపిసోడ్ లు మరికొన్ని రోజులు ప్రసారమయ్యే అవకాశం ఉన్నా వచ్చే సోమవారం నుంచి టీవీ షోలు, రియాలిటీ షోల ప్రసారాలు ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
లాక్ డౌన్ ప్రభావం టీవీ ఛానెళ్ల ఆదాయంపై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.