చైనా నుండి ఎప్పుడైతే కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో కి ఎంటర్ అయిందో మొదటిలో అద్భుతంగా ఇండియా తనని తాను కాపాడుకుంది.అంతేకాకుండా ప్రపంచంలో ఆ సమయంలో కరోనాతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న దేశాలకు సాయం కూడా చేయడం జరిగింది.
ఆ సమయంలో ఇండియా చేసిన సేవలకు మరియు కరోనా ని ఎదుర్కొన్న తీరుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశంసల వర్షం కురిపించింది.కానీ ఎప్పుడైతే కరోనా సెకండ్ వేవ్ విషయముల తప్పటడుగు వేసింది ప్రస్తుతం ఇండియాలో పరిస్థితులు చూసి ప్రపంచ దేశాలు సానుభూతి వ్యక్తం చేస్తున్నాయి.
అంతేకాక ఇండియా నుండి ఎవరు కూడా తమ దేశంలోకి అడుగు పెట్టకూడదు అనే స్థాయికి దిగజారిపోయే రీతిలో పరిస్థితులు ఇండియాలో నెలకొన్నాయి.ఇటువంటి తరుణంలో అనేక దేశాలు ఇండియాలో కరోనా పరిస్థితిని అధిగమించడానికి సాయం అందించడానికి ముందుకు వస్తున్నాయి.
ఆ రీతిగానే అమెరికా దేశంలో దిగ్గజ సంస్థలు పెద్ద ఎత్తున ఇండియాకి వైద్య పరికరాలు మరియు ఆక్సిజన్ కొరత తీర్చడానికి సాయం అందిస్తున్నయి.భయంకరంగా కేసులు పెరిగిపోవటం, మరణాలు సంభవిస్తున్న ఇలాంటి తరుణంలో అమెరికా వైట్ హౌస్.
కష్ట సమయంలో భారత్ కి అన్ని విధాలా అండగా ఉంటామని కీలక ప్రకటన చేసింది.ఖచ్చితంగా ఇండియాలో ఉన్న ప్రభుత్వంతో అమెరికా ప్రభుత్వం పని చేస్తుందని తెలియజేయడమే కాక.అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రభుత్వం నుంచి 100 మిలియన్ డాలర్ల సాయం అందించిందని పేర్కొంది.