తెలుగు, తమిళం, కన్నడ, ఇతర భాషల్లో 300కు పైగా సినిమాల్లో నటించి రజిత గుర్తింపును సొంతం చేసుకున్నారు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో పాటు కమెడియన్ రోల్స్ లో నటించి రజిత తన నటనతో మెప్పించారు.1987 సంవత్సరంలో రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన అగ్నిపుత్రుడు సినిమాతో రజిత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.రజిత ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం.
తాజాగా అలీతో సరదాగా షోకు గెస్ట్ గా హాజరైన రజిత ఆ షోలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.తనకు ట్రెయిన్ ఫోబియా ఉందని ఆమె చెప్పుకొచ్చారు.
సినిమా షూటింగ్ ను చూడాలని వెళ్లిన రజిత అనుకోకుండా సినిమాల్లో నటించాల్సి వచ్చింది.ఒకసారి తాను చెన్నై నుంచి హైదరాబాద్ కు ఏసీ బోగీలో వస్తున్న సమయంలొ వాష్ రూమ్ కు వెళ్లి డోర్ ఓపెన్ చేసిన తరువాత ఎదురుగా ఒకతను నిల్చొని ఉన్నారని నన్ను పట్టుకొని హగ్ చేసుకోవడానికి, ముద్దు చేసుకోవడానికి ట్రై చేశారని ఆమె చెప్పారు.
తాను గట్టిగా అరవాలని అనుకున్నా ట్రెయిన్ సౌండ్ ఎవ్వరికీ వినబడదని ఆ తర్వాత ఆ వ్యక్తి అక్కడినుంచి పారిపోయాడని రజిత చెప్పుకొచ్చారు.
ఆ తరువాత ఒక సందర్భంలో కబుర్లు చెబితేనే ట్రైన్ టికెట్ కన్ఫామ్ చేస్తానని టీటీఈ చెప్పారని అందుకే రైలు ప్రయాణం అంటే భయమని రజిత చెప్పుకొచ్చారు.ఆ తర్వాత నిర్మాతలకు తనకు రైలు టికెట్ బుక్ చేస్తే తన సహాయకులకు కూడా అదే బోగీలో టికెట్ ఇవ్వాలని రూల్ పెట్టానని రజిత తెలిపారు.
మరో సందర్భంలో తన కాలిని ఒక అభిమాని తలపై పెట్టుకున్నారంటూ తనకు ఎదురైన విచిత్రమైన అనుభవాన్ని రజిత చెప్పుకొచ్చారు.
అమెరికాలోని వర్జీనియాలో ఈ ఘటన చోటు చేసుకుందని రజిత అలీతో సరదాగా షోలో వెల్లడించారు.