అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేయడం, ప్రతిపక్షంలోకి మారాక ఎదుటి వారు చేస్తున్న తప్పులను ఎత్తిచూపడం రాజకీయ నేతలకు అలవాటుగా మారిన పని.ఇక నోటి దురుసు ఉన్న వారే రాజకీయాల్లో నెట్టుకొస్తారనే నానుడి ఉంది.
అయితే ఇలాంటి నోటి దురద వల్ల చిక్కుల్లో చిక్కుకోవడం కూడా జరుగుతుంది.
ఇకపోతే కరోనా సమయంలో ప్రజలకు చేయవలసిన సహాయం మరచి పనికిమాలిన రాజకీయాలు చేస్తున్న వారు ముఖ్యంగా మన రాష్ట్రాల్లో ఎక్కువగానే ఉన్నారట.
ఇప్పుడిప్పుడే ప్రజలకు ఈ విషయం అర్ధం అవుతుందని ముచ్చటించుకుంటున్నారట.ఇదిలా ఉండగా కరోనాపై లేనిపోని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఇదివరకే కర్నూలులో చంద్రబాబుపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
అయితే తాజాగా న్యాయవాదులు చేసిన ఫిర్యాదుపై గుంటూరు, నరసరావుపేట పోలీస్ స్టేషన్లలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై మరో రెండు కేసులు నమోదయ్యాయని సమాచారం.అసలే కరోనా ప్రజలతో చదరంగం ఆడుతుంటే ఈ రాజకీయనేతలు పనిగట్టుకుని విమర్శించుకోవడం ఏంటని ఏపీ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారట.