తెలంగాణలో రాజకీయ వ్యవహారం రంజుగా మారిందని చెప్పవచ్చు.మెదక్ జిల్లా మూసాయిపేట మండలం అచ్చంపేట గ్రామ రైతులు ఈటెల రాజేందర్ తమ భూములు కబ్జా చేసాడని సీఎం కేసీఆర్ కు లేఖ రాయడంతో కేసీఆర్ ఆ లేఖకు స్పందించిన కేసీఆర్ తక్షణ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.
వెంటనే మంత్రి పదవి నుండి కూడా భర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే.అయితే ఆ తరువాత ఈటెలకు కేసీఆర్ కు మధ్య మరింత గ్యాప్ పెరిగింది.
ఆ తరువాత రోజు కేసీఆర్ పై మాటల తూటాలు పేలుస్తూ రాజకీయాల్ని హీటెక్కించాడు.అయితే హుజురాబాద్ నియోజకవర్గం నుండి గత 20 ఏళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఈటెల రాజేందర్ హుజురాబాద్ అంటే ఈటెల, ఈటెల అంటేనే హుజురాబాద్ అన్నట్లుగా తయారయింది.
అయితే ఈటెలకు, గంగులకు మధ్య రాజకీయ ఆధిపత్య పోరు ఉందనేది నిర్వివాద అంశం.అయితే ఇప్పుడు ఈటెల తెరాస కు దూరం కావడంతో హుజురాబాద్ లో కూడా పార్టీ క్యాడర్ ను చెక్కు చెదరనీయకుండా ఈటెల వైపు వెళ్లకుండా వరుస సమావేశాలు నిర్వహిస్తూ హుజురాబాద్ లో ఈటెలను ఒంటరి చేయడమే అంతిమ లక్ష్యంగా నిర్ణయించుకొని పావులు కదుపుతున్నారు.
అయితే తాజాగా ఈటెల క్యాడర్ తో కూడా సమావేశమైన మంత్రి గంగుల భవిష్యత్తులో అందరికి సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది.