స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కొన్నేళ్ల గ్యాప్ తరువాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినా రీఎంట్రీలో సైతం వరుస ఆఫర్లతో సత్తా చాటుతున్నారు.ప్రస్తుతం శృతిహాసన్ చేతిలో సలార్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు ఉన్నాయి.
అయితే తాజాగా శృతిహాసన్ తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.టాలెంటెడ్ నటి అయిన శృతిహాసన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సొంతంగానే ఎదగటానికి కృషి చేస్తున్నారు.
తనకి సాయం చేయడానికి అమ్మానాన్నలు లేరని తల్లిదండ్రులు ఉన్నా డబ్బు కోసం తాను వాళ్లపై ఆధారపడటం లేదని చెప్పుకొచ్చారు.తాను ఎల్లప్పుడూ సొంతంగా తన కాళ్లపైనే నిలబడాలనే ప్రయత్నం చేస్తానని తన ఖర్చులకు అవసరమైన డబ్బులను తనే స్వయంగా సంపాదించుకుంటానని శృతిహాసన్ చెప్పుకొచ్చారు.
ఫ్యామిలీ మెంబర్స్ నుంచి తాను డబ్బులు తీసుకోనని తాను డబ్బులు సంపాదించుకోకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆమె పేర్కొన్నారు.
పని చేస్తే మాత్రమే తనకు డబ్బులు వస్తాయని లేకపోతే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని శృతిహాసన్ చెప్పుకొచ్చారు.
గతంలో తాను ఆర్థిక ఇబ్బందులు పడ్డానని శృతిహాసన్ తెలిపారు.ప్రస్తుతం తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల షూటింగ్ లలో పాల్గొనమని ఆఫర్ వస్తే పాల్గొంటానని ఆమె తెలిపారు.కరోనా విజృంభణ ఆగేవరకు తాను ఎదురు చూడనని ఆమె అన్నారు.కరోనా విజృంభిస్తున్నప్పటికీ తాను తాజాగా ఇల్లు కొన్ననని శృతిహాసన్ తెలిపారు.
సొంతంగా ఎదుగుతున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని శృతిహాసన్ పేర్కొన్నారు.తను సక్సెస్ కావడం వెనుక దేవుడు ఉన్నాడని తాను బలంగా నమ్ముతానని ఆమె వెల్లడించారు.
అయితే శృతిహాసన్ అకస్మాత్తుగా ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం వెనుక సలు కారణం తెలియాల్సి ఉంది.కోట్లలో పారితోషికం తీసుకునే శృతి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటూ చేసిన కామెంట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.