టాలీవుడ్ మాస్ డైరెక్టర్ లలో బోయపాటి శ్రీను ఒకరు.ఈ యన సినిమాలంటే ఫుల్ యాక్షన్ సీన్లతో ఉంటాయి.
భద్ర సినిమా తో తన జర్నీ మొదలుపెట్టి తన కెరీర్ లో చాలా సూపర్ హిట్ సినిమాలు తీసాడు.బోయపాటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తీసిన సినిమా సరైనోడు.
ఈ సినిమాతో మాస్ హిట్ ను తమ ఖాతాలో వేసుకున్నారు.అల్లు అర్జున్ ఈ సినిమాతో తనలోని మాస్ యాంగిల్ ను మరింత పరిచయం చేసాడు. ఈ సినిమాతో వీరి కాంబినేషన్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.అందుకే వీరి కాంబోలో మరొక సినిమా వస్తుందేమో అని ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించాడు.ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అప్పట్లోనే గీత ఆర్ట్స్ బ్యానర్ పై మరొక సినిమా చేయడానికి బోయపాటి శ్రీను ఒప్పుకున్నట్టు సమాచారం. అంతేకాదు అల్లు అరవింద్ ఆ సినిమా కోసం ముందుగా అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు టాక్.ఈ బ్యానర్ పై సినిమా చేయడానికి బోయపాటి ఇప్పుడు రెడీ అయినట్టు టాక్ నడుస్తుంది.
ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ గురించి చర్చించడానికి అల్లు అర్జున్ ను బోయపాటి రెండు సార్లు కలిశాడట.బోయపాటి స్టైలిష్ స్టార్ కోసం ఇప్పటికే ఒక పవర్ ఫుల్ యాక్షన్ స్టోరీ కూడా రెడీ చేసే పనిలో ఉన్నట్టు త్వరలోనే స్క్రిప్ట్ ను అల్లు అర్జున్ కు వినిపించి ఓకే చేసుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడట.
మరి బోయపాటి శ్రీను బన్నీ నుండి గ్రీన్ సిగ్నల్ తీసుకుంటాడో లేదో చూడాలి.ఇది ఇలా ఉండగా ప్రస్తుతం బోయపాటి బాలయ్యతో అఖండ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇటు అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.