తెలుగు ఓటీటీ ఆహా లో గత వారం నుండి స్ట్రీమింగ్ అవుతున్న సినిమా థ్యాంక్యూ బ్రదర్.జబర్దస్త్ యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా ను థియేటర్ లో విడుదల చేయాలని భావించారు.
కాని కొన్ని కారణాల వల్ల సినిమా ను ఓటీటీ ద్వారా నేరుగా ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారు.అనసూయ కు ఉన్న క్రేజ్ నేపథ్యం లో సినిమా ను భారీ మొత్తానికి ఆహా వారు కొనుగోలు చేయడం జరిగింది.
ఆహా లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది అనగానే అంచనాలు భారీగా పెరిగాయి.కాని అంచనాలు అందుకోవడం లో మాత్రం ఈ సినిమా విఫలం అయ్యింది.
అన్ని విధాలు గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది అంటూ టాక్ వచ్చింది.
జబర్దస్త్ హాట్ ఆంటీ యాంకర్ అనసూయను ప్రేక్షకులు ఆ పాత్రలో చూడాలనుకోలేదు.
కాని ఆమె మాత్రం నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అంటూ ఆ సినిమా ను చేసేందుకు ముందుకు వచ్చింది.పెద్ద ఎత్తున సినిమా ను ప్రేక్షకు ల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రమోషన్స్ చేసిన మేకర్స్ కు నిరాశే మిగిలింది.
థ్యాంక్యూ బ్రదర్ సినిమా తో ఆహా ఓటీటీ కి దక్కింది ఎంత అంటే మౌనమే సమాధానంగా నిలుస్తుంది.అల్లు అరవింద్ కాస్త తెలివిగా ఈ సినిమా ను కొనుగోలు చేశాడంటూ వార్తలు వస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం థ్యాంక్యూ బ్రదర్ సినిమా ను స్ట్రీమింగ్ చేయడం కోసం మొదట కోటి రూపాయలను నిర్మాతలకు చెల్లించారు.సినిమా సక్సెస్ అయితే వ్యూస్ మరియు రన్ టైమ్ ను బట్టి సినిమా కు డబ్బు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు.
కాని పరిస్థితులు అనుకూలించక పోవడంతో మొత్తం తారు మారు అయ్యింది.ఆహా కు ఈ సినిమా అంతంత మాత్రమే అన్నట్లుగా వ్యూస్ ను రన్ టైమ్ ను అలాగే కొత్త ఖాతాదారులను తెచ్చి పెట్టలేదు.