తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ వల్ల నెలకొంటున్న దుస్దితులకు, ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఏ మాత్రం సంబంధం లేకుండా ఉందనే ఆరోపణలు తీవ్రంగా వస్తున్న నేపధ్యంలో తెలంగాణ సీఎం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు లాక్ డౌన్ పెట్టాలా, వద్దా అనే నిర్ణయం మంత్రుల సమక్షంలో తీసుకోనున్నారు.అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ తప్పనిసరి అని మేధావులే చెపుతున్నారు.
ఇకపోతే కరోనాను కట్టడి చేయలేక, విధిలేని పరిస్థితుల్లో ఇప్పటికే పలు రాష్ట్రాలు పూర్తిస్థాయి లాక్ డౌన్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.కాగా మన తెలుగు రాష్ట్రాల్లో సైతం ఆందోళనకర స్థాయిలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి.
ఈ నేపధ్యం లో విమర్శలు తట్టుకో లేక ఈ మధ్యాహ్నం 2 గంటల కు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.ఇందులో లాక్ డౌన్ విధించే అంశమే కీలకంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది ఇక నైట్ కర్ఫ్యూ వల్ల పరిస్థితిలో పెద్దగా మార్పు లేకపోవడంతో లాక్ డౌన్ విధించడమే బెటర్ అనే యోచనలో సీఎం ఉన్నట్టు సమాచార మరి ఏ విషయం అనేది మధ్యాహ్నం తెలుస్తుంది.