యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఐదేళ్ళ పాటు ఏకంగా నాలుగు ప్రాజెక్ట్ లని లైన్ లో పెట్టాడు.ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ చిత్రాలు, అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్నవే కావడం విశేషం.
ప్రస్తుతం ఆది పురుష్ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.గ్యాప్ లేకుండా కంప్లీట్ స్టూడియోలో పూర్తి కరోనా నిబంధనల మధ్య ఈ సినిమా షూటింగ్ జరుపుతున్నారు.
దీంతో పాటు చేతిలో సలార్, నాగ్ అశ్విన్ సినిమాలతో పాటు సిద్దార్ద్ ఆనంద్ సినిమా కూడా ఉండటంతో కరోనా సిచువేషన్ ఉన్న కూడా బయటకి కూడా రాకుండా క్రూ మొత్తం ఒకే చోట ఉంటూ షూటింగ్ చేసుకునేలా ప్లాన్ చేసుకున్నారు.దీంతో అది పురుష్ షూటింగ్ ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతుంది.
ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ షూటింగ్ ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయింది.రెండో షెడ్యూల్ కోసం చేవెళ్ళ సమీపంలో భారీ సెట్స్ ని డిజైన్ చేయించారు.
అయితే ఇప్పట్లో ఈ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందా అనేది అనుమానమే.ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ హాట్ న్యూస్ బయటకి వచ్చింది.
ఇందులో బాహుబలి శివగామి రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతుందని టాక్ నడుస్తుంది.ఇందులో ప్రభాస్ కి అక్కగా ఆమె పాత్ర ఉంటుందని, సినిమాలో ఎమోషనల్ ఎలిమెంట్స్ తో రమ్యకృష్ణ, ప్రభాస్ కి సంబందించిన సన్నివేశాలు ఉంటాయని ప్రచారం జరుగుతుంది.
మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలి.