తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం అక్కడ నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.ఈ సినిమా ద్వారా తన మార్కెట్ ని ఇండియన్ వైడ్ గా పెంచుకునే పనిలో ఉన్నాడు.
ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే రాప్రారంభామైంది.ఇదిలా ఉంటే ఇళయ దళపతి విజయ్ తో టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పాన్ ఇండియా సినిమా చేయడానికి ఇప్పటికే డేట్స్ తీసుకున్నాడు.
అలాగే టాలెంటెడ్ స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి కథకి ఇప్పటికే ఒకే చెప్పాడు.త్వరలో ఈ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది.
మైత్రీ మూవీ చాలా రోజులుగా విజయ్ డేట్స్ కోసం ప్రయత్నం చేసి అనూహ్యంగా దిల్ రాజు తెరపైకి వచ్చారు.ఇదిల ఉంటే ఇప్పుడు ఈ సినిమా కోసం దిల్ రాజుకి ఇవ్వనున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ అయ్యింది.
కోలీవుడ్ ప్రస్తుతం అతను ఏ సినిమాకి అయిన 75 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.అయితే పాన్ ఇండియా సినిమా కోసం దిల్ రాజు ఏకంగా పది కోట్లు పెంచేసి అతనికి 85 నుంచి 90 కోట్ల వరకు ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది.
కోలీవుడ్ లో అతనికి క్రేజ్ ఉంది కాబట్టి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చిన నిర్మాతకి వర్క్ అవుట్ అవుతుంది.అయితే తెలుగులో అతనికి పెద్దగా మార్కెట్ లేదు.అయినా కూడా దిల్ రాజు అంతగా రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీ అయ్యాడంటే కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో బిజినెస్ ని లెక్కలు వేసుకొని అలా కమిట్ అయ్యి ఉంటాడని టాక్ వినిపిస్తుంది.టాలీవుడ్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ గా డార్లింగ్ ప్రభాస్ వంద కోట్ల వరకు తీసుకుంటే, మహేష్ బాబు 80 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.
ఇప్పుడు విజయ్ అతన్ని కూడా బీట్ మహేష్ బాబుని కూడా బీట్ చేసే స్థాయిలో డబ్బులు తీసుకోవడం విశేషం.