తెలుగు సినీ దర్శకుడు తేజ దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు.మొదట్లో నిర్మాత, ఛాయాగ్రాహకుడు, రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ ఆ తర్వాత తన దర్శకత్వంతో తెలుగు, హిందీ, తమిళం వంటి భాషలలో చేశాడు.
ఇక చాలా వరకు ఈయన సినిమాలలో యంగ్ హీరోల ను పరిచయం చేస్తుంటాడు.
నువ్వు నేను, జయం, చిత్రం వంటి సినిమాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపును అందుకున్న తేజ.చిత్రం సినిమా సీక్వెల్ చిత్రం 2 తెరకెక్కించనున్నాడు.ఇప్పటికే ఈ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకోగా అందులో 50 మంది కొత్త వాళ్ళని పరిచయం చేయనున్నాడు.
అంతేకాకుండా ఈ సినిమాకు ఆర్ పి పట్నాయక్ సంగీతాన్ని అందించనున్నట్లు కూడా ప్రకటించాడు.ఈ సినిమాతో తన వారసుడిని కూడా పరిచయం చేయాలనుకుంటున్నాడు తేజ.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాను అన్నీ కుదిరితే సెట్స్ పైకి తీసుకెళ్లాలని అనుకున్నాడు.
ప్రస్తుతం దేశ పరిస్థితులు అనుకూలంగా లేనందున ఈ ఆలోచనను పక్కన పెట్టేసాడు.
అంతే కాకుండా ఈ సమయంలో మరో స్టార్ హీరో సోదరుడి సినిమాను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది.ప్రముఖ హీరో దగ్గుబాటి రానా సోదరుడు అభిరామ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టనున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ విషయం గురించి వార్తలు కూడా వచ్చాయి.
అందుకే డైరెక్టర్ తేజ ప్రస్తుతం ఈ సినిమా పై ఫోకస్ పెట్టారని తెలుస్తోంది.ఇక ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ వారు నిర్మిస్తున్నారు.ఈ సమయంలో ఈ సినిమాను పూర్తిచేయాలని దృష్టిలో పెట్టుకొని చిత్రం సీక్వెల్ చిత్రం 2 సినిమా వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.