కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకున్న పుజారా దంపతులు.. !

కరోనా ఏ రంగాన్ని వదలడం లేదన్న విషయం తెలిసిందే.దీని దెబ్బకు చివరికి సజావుగా సాగుతున్న క్యాష్ రీచ్ లీగ్ ఐపీఎల్ కూడా బ్రేకులు పడ్దాయి.

 Pujara Couple Gets First Dose Of Corona Vaccine, India, Cricketer, Pujara Couple-TeluguStop.com

ఇదిలా ఉండగా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత ఆటగాళ్లంతా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని బీసీసీఐ కూడా సలహా ఇచ్చిన విషయం తెలిసిందే.దీంతో ఐసీసీ వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో పాల్గొనేందుకు వెళ్లే భారత క్రికెటర్లు ఒక్కొక్కరు తమ ఫస్ట్ డోస్ వేయించుకోవడానికి క్యూ కట్టారు

ఇప్పటికే రహానే దంపతులు కూడా టీకా తీసుకున్న విషయం తెలిసిందే.

ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొవిడ్‌ వ్యాక్సిన్ తొలి డోసు సోమవారం తీసుకోగా, టెస్టు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ పుజారా తన భార్య పూజతో కలిసి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ మొదటి డోసు వేయించుకున్నారు.ఈ నేపధ్యంలో పుజారా అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని కోరుతున్నట్లు ట్వీట్‌ చేశాడు.

ఇకపోతే తాజాగా కోవిడ్ రెండో వ్యాక్సినేషన్ పక్రియ కూడా మొదలైన విషయం తెలిసిందే ఇప్పటికే చాలామంది ప్రముఖులు కరోనా టీకా మొదటి డోసు ఇప్పించుకుని రెండో డోసుకు సిద్దం అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube