టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్.టి.
ఆర్ కు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన విషయం తెలిసిందే.కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని భయపడాల్సినది ఏమి లేదని.
డాక్టర్ల పర్యవేక్షణలో హోం ఐసోలేషన్ లో ఉన్నామని ట్వీట్ చేశారు ఎన్.టి.ఆర్.అయితే ఎన్.టి.ఆర్ కు కరోనా అని తెలియగానే నందమూరి ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది.తమ అభిమాన హీరో త్వరగా కరోనా నుండి కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.ఇదిలాఉంటే ఎన్.టి.ఆర్ కు కరోనా అని తెలియగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా స్పందించారు.
తారక్ త్వరగా కోలుకోవాలని.టేక్ కేర్ అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు.లోకేష్ కూడా ఎన్.టి.ఆర్ మీరు సత్వరమే కోలుకోవాలని ప్రర్ధిస్తున్నాను.నీతో పాటు కుటుంబ సభ్యులు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
ఎన్.టి.ఆర్ మేనత్త బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి కూడా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు.స్టార్ హీరోల్లో ఇప్పటికే రాం చరణ్ కరోనా బారిన పడి రికవరీ కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ కరోనా పాజిటివ్ తో హోం ఐసోలేషన్ లో ఉన్నారు.
లేటెస్ట్ గా అల్లు అర్జున్ కూడా కరోనా బారిన పడ్డారు
.