కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక నిరవధిక వాయిదా పడింది.సిడబ్ల్యుసి ఏకాభిప్రాయంతో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక వాయిదా పడటం జరిగింది.
కరోనా పరిణామాలను బట్టి సంస్థాగత ఎన్నికలు వాయిదా వేసినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.దేశంలో భారీగా కేసులు పెరిగిపోతుండటంతో సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో.
పార్టీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.వాస్తవానికి జనవరి 22వ తారీకు జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో.
ఈ ఏడాది జూన్ నెలాఖరు కల్లా పార్టీ కొత్త అధ్యక్ష ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పార్టీ అధిష్టానం భావించింది.
అయితే ప్రస్తుతం మహమ్మారి వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు కరోనా కేసులు అధికంగా పెరిగిపోతూ ఉండటంతో.
ప్రస్తుత పరిణామాలను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిడబ్ల్యూసి తెలియజేసింది.ఇటీవల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో .ఆశించిన స్థాయిలో పార్టీ రాణించ లేకపోవటంతో సోనియాగాంధీ పార్టీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో దేశవ్యాప్తంగా కీలక నేతలు పాల్గొన్నారు.ఏది ఏమైనా జూన్ నెలాఖరు కల్లా పార్టీ కొత్త అధ్యక్షుని ఎన్నుకోవాలని ఈ సమావేశం పార్టీ నేతలు డిసైడ్ అయినట్లు సమాచారం.