జర్నలిస్ట్ టిఎన్ఆర్ కరోనావైరస్ తో పోరాడి ఈ రోజు ఉదయం మరణించారు.గతంలో కరోనా బారిన పడిన టిఎన్ఆర్ కొత్తకోట టైంలోనే కోలుకోవడం జరిగింది.
కానీ ఇటీవల ఒక్కసారిగా ఆక్సిజన్ పల్స్ రేటు పడిపోవడంతో హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయి చికిత్స తీసుకుంటూ ఈరోజు ఉదయం మరణించడంతో ఆయన మరణ వార్త విని జర్నలిస్ట్ మరియు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఇండస్ట్రీలో అనేక మంది హీరో హీరోయిన్లు,డైరెక్టర్లను ప్రముఖ టాక్ షో ద్వారా ఇంటర్వ్యూలు చేస్తూ బాగా ప్రాచుర్యం పొంది సినిమా రంగంలో కూడా అనేక అవకాశాలు అందుకుంటూ వస్తున్నారు.
చాలా మృదుస్వభావి అయినా TNR( తుమ్మల నరసింహారెడ్డి )ఏదైనా విషయం అడగాల్సి వస్తే ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం.కాగా గతంలో కరోనా బారిన పడిన TNR( తుమ్మల నరసింహారెడ్డి ) మహమ్మారిని జయించడం జరిగింది.
అయితే ఇటీవల ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో అనేక ఇబ్బందులు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాదులో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు.పల్సర్ రేటు సోమవారం బాగా పడిపోవడంతో పాటు ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం కన్నుమూశారు.
TNR మరణవార్త తెలుసుకుని చాలామంది సినీ ప్రముఖులు మరియు మీడియా రంగానికి చెందిన జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు.