ఏపీలో కరోనా వైరస్ తీవ్రత అంతకంతకూ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.ఊహించని విధంగా కొత్త కేసులు రోజురోజుకీ పెరిగిపోతు ఉండటంతో మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం .
కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ప్రస్తుతం 18 గంటల పాటు పాక్షిక కర్ఫ్యూ విధిస్తోంది.ఇదిలా ఉంటే కరోనా బారినపడిన రోగులు అక్కడ అక్కడ సరైన వైద్యం అందక అనేక అవస్థలు పడుతున్నారు.
ఈ రీతిగానే హిందూపురం నియోజకవర్గంలో కరోనా బారిన పడే రోగులకు సరైన బెడ్లు దొరకక ఆక్సిజన్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆ సమయంలో హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలయ్య బాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు.హిందూపురం నియోజక వర్గ ప్రజల కోసం ఏకంగా ఎమ్మెల్యే బాలయ్య.30 లక్షల ఖరీదు చేసే మెడిసిన్ లు పంపించి నియోజకవర్గంలో కరోనా బారిన పడిన రోగులను.ఆదుకోవటానికి తన వంతు కృషి చేశారు.
బాలయ్యబాబు పంపించిన మెడిసిన్ కిట్ లను స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు.నియోజకవర్గ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిడెంట్ కు అందించారు.