టాలీవుడ్ యంగ్ మెగా హీరో రామ్ చరణ్ వరుస ఆఫర్ లను తన ఖాతాలో నింపుకున్నాడు.ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
అంతేకాకుండా ఈ సినిమాలో మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ మరో క్రేజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా గురించి చర్చలు జరుగుతుండగా.ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కనుంది.ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.ఇక ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నదని వార్తలు వినిపించాయి.
ఇక ఈ సినిమాలో ఒక వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇంతకీ అదేంటంటే ఇందులో మరో కన్నడ స్టార్ హీరో నటించనున్నాడని తెలుస్తున్నాయి.
ఈగ, సైరా నర్సింహారెడ్డి వంటి సినిమాలలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్.
ఇక ఈ సినిమాలో ఈయన నటించనున్నట్లు వార్తలు తెగ వినిపిస్తున్నాయి.అంతేకాకుండా దీనికి సంబంధించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న కిచ్చా సుదీప్.ఈ సినిమా గురించి కొన్ని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఈ విషయం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.ఇక శంకర్ ప్రస్తుతం భారతీయుడు 2 సినిమా లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ప్రాజెక్టును మొదలు పెట్టనున్నారు.ఇక రామ్ చరణ్ కు మరో కోలీవుడ్ డైరెక్టర్ నుండి ఆఫర్ కూడా వచ్చింది.
అంతేకాకుండా రంగస్థలం సీక్వెల్ ను కూడా తీయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది.