దేశంలో జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేంద్రాన్ని విమర్శిస్తూ మాట్లాడారు ఎం.ఐ.
ఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.కేంద్రానికి కొన్ని ప్రశ్నాస్త్రాలు వదిలారు ఓవైసీ.
కరోనా ఉదృతి ఈ రేంజ్ లో ఉంటే తగినన్ని వ్యాక్సిన్లు సకాలంలో ఎందుకు ఆర్డర్లు ఇవ్వలేకపోతున్నారంటూ కేంద్రాన్ని టార్గెట్ చేశారు ఓవైసీ.మనకు కావాల్సిన స్టాక్ లేదని తెలిసి కూడా మోడీ తన బొమ్మతో కూడిన వ్యాక్సినల్ను విదేశాలకు ఎందుకు పంపించారని అన్నారు.
విదేశాల్లో తయారైన కోవిడ్ వ్యాక్సిన్ లు భారత్ లో పంపిణీ చేసేందుకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదో చెప్పాలని అన్నారు.వ్యాక్సిన్ తయారు చేసేందుకు ఇతర కంపెనీలకు లైసెన్స్ ఇవ్వకుండా ఎందుకు ఆపుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
వ్యాక్సిన్ పై జి.ఎస్.టీ వసూళు చేస్తున్నారు.వ్యాక్సినేషన్ విధానాలను రాష్ట్రాలకు అప్పగించాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ ఓవైసీ ప్రశ్నలు సంధించారు.
వ్యాక్సిన్ అందరికి ఉచితంగా అందించాల్సిన అవసరం ఉందని.కేంద్రీకృత విధానంలో వ్యాక్సిన్ సేకరణ చేపట్టాలని.
అయితే కేంద్రం రాష్ట్రాలకు పూర్తిగా వికేంద్రీకరణ పద్ధతిలో వ్యాక్సిన్లను రాష్ట్రాలకు అందిచాలని అన్నారు.ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ విధానం పక్కన పెట్టి అందరికి సులుగా వ్యాక్సిన్ వచ్చేలా వెసులుబాటు కల్పించాలని అన్నారు.