కరోనా విజృంభిస్తున్న ఇలాంటి టైం లో సరిపడినంత వైద్యులు అవసరం ఉంటారు అందుకే తెలంగాణా ప్రభుత్వం ఈ పాండమిక్ టైం లో రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల మంది ఎం.బీ.
బీ.ఎస్ పూర్తి చేసిన వారిని తీసుకోవాలని నిర్ణయించింది.ప్రగతి భవన్ లో సిఎం కే.సి.ఆర్ వైద్య ఆరోగ్య శాఖా అధికారులతో సమీక్ష నిర్వహించారు.వైద్య ఆరోగ్య శాఖా సిబ్బందిని ఫ్రంట్ లైన్ వారియస్ గా గుర్తించాలని ఆదేశించారు.
ఇక రాష్ట్రలో ఉన్న ఖాళీలను పూర్తి చేసేలా 50 వేళ మందిని తీసుకోవాలని చూస్తున్నారు.వివిధ డిపార్ట్మెంట్ లో సిబ్బందిని నియమించేందుకు దరఖాస్తులను ఆహ్వానించాలని చెప్పారు.
వరంగల్, ఆదిలాబాద్ రింస్ వంటి హాస్పిటల్స్ లో సిబ్బందిని వెంటనే నియమించేలా చర్యలు తీసుకోనున్నారు.ప్రభుత్వ హాస్పిటల్స్ లో 7393 బెడ్లు, 2470 ఆక్సిజన్ బెడ్లు, 600 వెంటిలేటర్ బెడ్లు అందుబాటులో ఉన్నాయని సిఎం కే.సి.ఆర్ కు అధికారులు రిపోర్ట్ అందించారు.ఐద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ సిఎం కే.సి.ఆర్ తో ఫోన్ లో మాట్లాడి కరోనా నియంత్రణపై రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలపై చర్చించారు.తెలంగాణా రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం తక్షణ డాక్టర్స్, హాస్పిటల్ సిబ్బందికి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఎం.బీ.బీ.ఎస్ పూర్తి చేసిన వారందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.