మష్రూమ్స్.వీటినే తెలుగులో పుట్ట గొడుగులు అంటారు.
చూసేందుకు తెల్లగా, గొడుగు ఆకారంలో ఉండే ఈ పుట్ట గొడుగులతో ఎన్నో రకాల వంటలు తయారు చేస్తుంటారు.మష్రూమ్స్ తో ఏ వంటకం చేసినా రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది.
అలాగే మష్రూమ్స్తో టీ కూడా తయారు చేస్తుంటారు.ఈ టీ బోలెడన్ని పోషకాలు కలిగి ఉండటమే కాదు.
అనేక జబ్బులను కూడా నివారిస్తుంది.ముఖ్యంగా అధిక బరువును నియంత్రించడంలో మష్రూమ్ టీ గ్రేట్గా సమాయపడుతుంది.
మరి మష్రూమ్ టీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.మష్రూమ్స్ శుభ్రం చేసుకుని బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి.
ఇప్పుడు గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసి.అందులో మష్రూమ్ పొడి, చిన్న అల్లం ముక్క వేసి బాగా మరిగించుకోవాలి.
ఇప్పుడు దీనిని వాడబోసుకుని.అందులో కొద్దిగా తేనె మరియు నిమ్మ రసం కలిపితే మష్రూమ్ టీ సిద్ధమైనట్టే.
మష్రూమ్స్లో ప్రోటీన్ అధికంగా, కేలరీలు తక్కువగా ఉంటాయి.అందు వల్ల, ఈ మష్రూమ్ టీని రెగ్యులర్గా ఒక కప్పు చప్పున తీసుకుంటే.
శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.అదే సమయంలో ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.
ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.
అలాగే మష్రూమ్ టీని సేవించడం వల్ల శరీరానికి కావాల్సిన కాల్షియం, విటమిన్ డి అందుతాయి.దాంతో ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి.రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
అంతేకాదు, మష్రూమ్ టీని తీసుకోవడం వల్ల అలసట, మానసిక ఒత్తిడి సమస్యలు మటు మాయం అవుతాయి.రక్త పోటు కంట్రోల్లో ఉంటుంది.
అతి ఆకలి తగ్గు ముఖం పడుతుంది.జీర్ణ వ్యవస్థ పని తీరు కూడా మెరుగు పడుతుంది.
సో.బరువు తగ్గాలనుకున్న వారే కాకుండా.అందరూ మష్రూమ్ టీని తీసుకోవచ్చు.