ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వం లో అఖండ సినిమా చేస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ తో అంచనాలు పీక్స్ కు వెళ్లాయి.
ఇంత వరకు చూడని సరికొత్త లుక్ లో బాలయ్య కనిపించాడు.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సయేశా సైగల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఈ సినిమాను మే 28 న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.
ఈ సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేయబోతున్నాడు.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న అనిల్ మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా ప్లాప్ అవ్వలేదు.సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన ‘సరిలేరు నీకెవ్వరూ‘ గత సంవత్సరం సంక్రాంతికి విడుదల అయి సూపర్ హిట్ అయ్యింది.
ఆ తర్వాత అనిల్ F2 సినిమాకు సీక్వెల్ గా ‘F3‘ సినిమా చేస్తున్నాడు.
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన F2 సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు.అందుకే అనిల్ ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు.అనిల్ రావిపూడి తెరకెక్కించే సినిమాలన్నీ ఇప్పటి వరకు కామెడీ జోన్ తోనే తెరకెక్కించాడు.
అటు బాలయ్య చుస్తే ఫుల్ యాక్షన్ సినిమాలనే చేస్తూ వస్తున్నాడు.అందుకే వీరి కాంబినేషన్ ఎలా ఉంటుందో అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అయితే గత కొద్దీ రోజులుగా అనిల్ బాలయ్యతో చేసే సినిమా మల్టీ స్టారర్ అంటూ వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో అనిల్ ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాడు.
ఈ విషయం పై తాజాగా ఒక ఇంటర్వ్యూ లో అనిల్ మాట్లాడుతూ ఈ సినిమా మల్టీ స్టారర్ మూవీ కాదు.ఇప్పటికే నేను ఈ సినిమా కథ కూడా రెడీ చేశాను ఇది ఒక డిఫరెంట్ జానర్ లో తెరకెక్కబోతుంది” అని ఆయన తెలిపాడు.
దీంతో ఈ వార్తలకు ఇంతటితో ఫుల్ స్టాప్ పడ్డట్టే.