తుఫాను అయినా కాసేపు వచ్చి పోతుంది గానీ ఏపీ రాజకీయ పర్వంలో మాటల తుఫాను మాత్రం అంతం లేకుండా కొనసాగుతూనే ఉంది.ముఖ్యంగా టీడీపీ వర్సెస్ వైసీపీ తమ టార్గెట్ విమర్శించు కోవడం అనే రీతిలో వీరి వ్యవహారం సాగుతుంది.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడైతే కరోనా వైరస్ మీద వ్యాఖ్యానించారో అప్పటి నుండి ఈ యుద్ధం రోజు రోజుకు ముదురుతుంది.
ఈ క్రమంలో మరో సారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
నీ హయామంలో తుపాన్లు వచ్చి ప్రజలు నిరాశ్రయులై, సర్వం కోల్పోయి అల్లాడుతున్న సమయంలో హెరిటేజ్ సరుకులను మంచి నీళ్లలా అమ్ముకున్న నీచ చరిత్ర నీది అధికారం దక్కలేదనే అక్కసుతో మతి భ్రమించి నోటికొచ్చినట్లు మాటాడుతున్న చంద్రబాబు నీ దగ్గర మంత్ర దండం ఏదైనా ఉంటే కుప్పంలో ఒక్క కరోనా రోగి లేకుండా చేయొచ్చుగా అంటూ విమర్శల బాణాలు వదిలారు విజయసాయిరెడ్డి.
ఇకపోతే 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏపీ ప్రజలకు పొడిచింది ఏముంది.
ప్రజలను నమ్మించి దోచుకున్నందుకేగా నీకు సున్నం బొట్లు పెట్టి ఇంటికి పంపించింది అంటూ ఎద్దేవ చేశారట విజయసాయిరెడ్డి.మరి ఈ విమర్శల పై చంద్రబాబు స్పందన ఏంటో చూడాలి.