సైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఈ మధ్యనే కరోనా బారిన పడ్డారు.దీంతో ఈ విషయం తెలిసినప్పటి నుండి అభిమానులు అల్లు అర్జున్ క్షేమ సమాచారాన్ని తెలుసుకోవాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
పుష్ప సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అల్లు అర్జున్ కు కరోనా సోకింది.దీంతో ఆయన గృహ నిర్బంధం లోకి వెళ్లి పోయారు.
కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో అల్లు అర్జున్ ప్రస్తుతం ఉన్నట్టు తెలుస్తుంది.,/br>
వైద్యుల సలహాలు సూచనలు పాటిస్తూ కరోనా తో పోరాడుతున్నాడు.
అయితే ఆయన బాగానే ఉన్నానని సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టిన ఫ్యాన్స్ కంగారు తగ్గలేదు.ఇది ఇలా ఉండగా ఈ విషయం పై రామ్ చరణ్ స్పందిస్తూ ఒక లెటర్ రాసాడు.
దీనిని బన్నీ తన అకౌంట్ లో షేర్ చేయడంతో ఇప్పుడు అది వైరల్ అయ్యింది.అల్లు అర్జున్ త్వరగా కోలుకోవాలని రామ్ చరణ్ ఒక మెసేజ్ చేసాడు.
నీ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను నీవు కుదుట పడిన తర్వాత ఒకసారి కలుద్దాం అని ప్రేమతో నీ చరణ్ అని రామ్ చరణ్ బన్నీ కు ఒక లెటర్ రాసి ఈ మెసేజ్ పంపాడు.దీనిని బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసాడు.ఈ మెసేజ్ చూసి ఇద్దరి ఫ్యాన్స్ తెగ ఆనంద పడుతున్నారు.ఇది ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నారు.ఇది టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కుతుంది.
ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.ఇక అల్లు అర్జున్ లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప‘ సినిమా చేస్తున్నాడు.