అగ్రరాజ్యంగా అమెరికా తర్వాత పిలవబడుతున్న భారత్ కు ఇప్పుడు కరోనా కష్టాలు అధికమయ్యాయి.మోదీ ప్రధానిగా ఉండడంతో మొన్నటి వరకు భారత్ ఇమేజ్ అమాంతం పెరిగి పోయిందని, ఎప్పుడూ చూడని విధంగా దేశమంతా అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తోందని , ఎంతో గొప్పగా చెప్పుకున్నా, ఆ సానుకూలత మొత్తం ఒకేసారి తుడిచిపెట్టుకుపోయింది.
దేశవ్యాప్తంగా బీజేపీ హవాకు అడ్డు లేకుండా ఉండేది.ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తో పాటు , కేంద్రంలో బిజెపి అధికారంలోకి రాకుండా చేయగలిగిన సత్తా ఉన్న పార్టీలు పెద్దగా లేకపోవడం ఇవన్నీ బిజెపి కి బాగా కలిసి
దేశవ్యాప్తంగా మోదీ పరిపాలన తీరు , పాలనలో డొల్లతనం ఒక్కసారిగా బయట పడేలా చేసింది.
కరోనా కట్టడి విషయంలో కేంద్రం పై ప్రకటనలకు మాత్రమే పరిమితం అయిపోవడం, పూర్తిగా రాష్ట్రాలదే బాధ్యత అన్నట్లుగా వదిలివేయడంతో మోదీ గ్రాఫ్ దేశవ్యాప్తంగానే కాక , ప్రపంచవ్యాప్తంగానూ పోయింది.అసలు కరోనా కు ఎదుర్కొనేందుకు తగిన ముందుచూపు లేకపోవడం, ప్రపంచంలోనే కరోనా ఉద్ధృతి ఉన్న దేశాలలో భారత్ అగ్రస్థానంలో ఉండటం ఇవన్నీ మోదీ పరిపాలన లో డొల్లతనాన్ని బయటకు తెలియజేస్తున్నాయి.
ప్రతిపక్షాలు ఏ విషయంలో మోదీ ప్రభుత్వాన్ని విమర్శించినా, అనేక విషయాలపై సమాధానం చెప్పాలి అంటూ డిమాండ్ చేసినా, మోదీ ఎక్కడా స్పందించేవారు కాదు.
కానీ ఇప్పుడు కరోనా విషయంలో దేశమంతా మోదీ తీరును ప్రశ్నిస్తూ ఉండడంతో , ఆయన ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారు.ఇక దేశ వ్యాప్తంగా మోదీ రాజీనామా చేయాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది .సోషల్ మీడియాలో ఇది ఒక ఉద్యమంగా మొదలైంది.మోదీ పై వ్యతిరేక కథనాలు ప్రచారం చేసేందుకు జాతీయ మీడియా మొహమాట పడుతున్నట్లుగా వ్యవహరిస్తున్నా, అంతర్జాతీయ మీడియా మాత్రం మోడీ వైఫల్యాలను ప్రపంచానికి చూపిస్తోంది .భారత్ లో ఎంతటి దుర్భర పరిస్థితులు ఎదురవుతున్నాయి అనే విషయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తూ, మోదీ పరిపాలన ను ఎద్దేవా చేస్తున్నాయి.భారత్ లో మోడీ పరిపాలన పరంగా విఫలం కావడంతో, దానికి ప్రపంచ దేశాలు ఎలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే వాదనను అంతర్జాతీయ మీడియా హైలెట్ చేస్తూ ఉండడం వంటివి మోదీ బలహీన ప్రధాని
.