టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయిపల్లవి.మలయాళం చిత్రం ‘ప్రేమమ్’ద్వారా పరిచయమైన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.
ఎక్స్పోజింగ్కు దూరంగా ఉంటూ కేవలం తన నటనతోనే లక్షలాది మంది అభిమానులను సంపాధించుకుంది.నేడు ఈ నేచురల్ బ్యూటీ పుట్టిన రోజు.
నేటితో ఈ భామ 29వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది.సాయిపల్లవిది తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోటగిరి అనే చిన్న గ్రామం.
తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయి చేర్చింది.ఈమె, చెల్లెలు పూజ కవల పిల్లలు.
కోయంబత్తూరు లో పాఠశాల విద్యనభ్యసించింది.తల్లి ప్రభావంతో ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది.
తన డ్యాన్సుతో నటనతో హీరోయిన్స్లల్లో ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరోయిన్ సాయిపల్లవి.
సాయిపల్లవి, ధనుష్ జంటగా నటించిన మారి-2చిత్రంలోని రౌడీ బేబీ సాంగ్ యూట్యూబ్లో 1.14 బిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించి రికార్డు సృష్టించింది.ఫిదా చిత్రంలోని ‘వచ్చిండే’ సాంగ్ 300 మిలియన్ల వ్యూస్ దాటింది.ఇక తాజాగా లవ్స్టోరీ సారంగదరియా సాంగ్ 17.6 మిలియన్ వ్యూస్ దాటింది.సౌత్లో ఒక హీరోయిన్ పాటకు ఇంతటి ఆదరణ రావడం ఒక్క సాయి పల్లవికే సొంతం.ప్రస్తుతం ఈ హీరోయిన్ టాక్సీవాలా’ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శ్యామ్ సింగ రాయ్ చిత్రంలో నటిస్తోంది.
నాని ఈ సినిమాలో హీరో.కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ కూడా నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సాయిపల్లవి పోస్టర్ విడుదలైంది.పోస్టర్ లో కాళికాదేవి అవతరంలో సాయి పల్లవి కనిపిస్తోంది.
ప్రస్తుతం ఈ పోస్టర్ చూసిన అభిమానులు ఆమె లుక్ కు ఫిదా అయిపోయారు.ఇందులో సాయిపల్లవి ఉగ్రరూపంతో ఉంది.
ఇది సినిమాలోని పాటలో భాగమేమో అని అనుకుంటున్నారు.