కరోనా వల్ల నాకు జరిగిన నష్టం ఇదే... అనసూయ వైరల్ కామెంట్స్

ప్రస్తుతం దేశంలో కరోనా విజ్రుంభిస్తోంది.కరోనా దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.

 This Is The Damage Done To Me By Corona Anasuya Viral Comments, Actress Anasuya,-TeluguStop.com

అయితే కరోనా మొదటి వేవ్ లో కేసులు ఎక్కువగా నమోదయినా మరణాలు మాత్రం తక్కువగా నమోదయ్యాయి.కాని కరోనా సెకండ్ వేవ్ లో మాత్రం కేసులు ఎక్కువగా నమోదవుతున్న తరుణంలో ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు.

అయితే కరోనా సెకండ్ వేవ్ లో అన్ని రకాల ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది.అయితే తాజాగా ఇంటర్వ్యూలో కరోనా వల్ల తనకు జరిగిన నష్టాన్ని చెప్పుకొచ్చింది.

ఇంత కరోనా ఉన్నా నాకు ఆఫర్లు వస్తున్నా, కరోనా లేకపోయి ఉంటే మంచి సినిమా ఆఫర్లు వచ్చి ఉండేవని, కెరియర్ ఇంకా ఫుల్ స్వింగ్ లో ఉండేదని చెప్పుకొచ్చింది.

ప్రతి ఒక్కరు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, మునుపటి రోజులు వచ్చే వరకు జాగ్రత్తగా మసులుకోవాలని అనసూయ చెప్పుకొచ్చింది.

మా పిల్లలు కరోనా సమయంలో ఏమి చేయాలో తోచక శూన్యంలోకి చూస్తూ ఉంటున్నారని, మామూలు రోజుల్లో కాలనీలో ఆడుకుంటూ ఉండేవారని, వాళ్ళను అలా చూస్తూనే బాధేస్తోందని అనసూయ చెప్పుకొచ్చింది.ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.

త్వరగా కరోనా పరిస్థితుల నుండి త్వరగా కోలుకొని సాధారణ పరిస్థితులు వస్తాయని అనుకుంటుంన్నానని అనసూయ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube