ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కరోనా వేరియంట్ కర్నూలు జిల్లాలో ప్రబలుతున్నట్లు చంద్రబాబు ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ లో కామెంట్లు చేయటం తెలిసిందే. N440K అనే కొత్త కరోనా వేరియంట్ సాధారణం దాని కన్నా 15 రెట్లు వేగవంతంగా వ్యాప్తి చెందుతుంది అంటూ వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన కామెంట్లపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి కొడాలి నాని.అసలు వైరస్ కర్నూలు లో పుట్టలేదు.
చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో పుట్టిందని చంద్రబాబుపై కొడాలి నాని సెటైర్లు వేశారు.దాని పేరు నారా కరోనా అని అన్నారు.70 సంవత్సరాల క్రితం పుట్టిందని సీబీఎన్ 420 అని… రాష్ట్రాన్ని నాశనం చేయాలని.అటూ ఇటూ తిరుగుతోంది అంటూ వ్యంగ్యంగా విమర్శించారు.
తన సామాజిక వర్గానికి చెందిన నలుగురిని పత్రికలు, మీడియా ఛానల్స్ పెట్టించి ప్రజలలో భయాందోళన కలిగించే రీతిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని కొడాలి నాని సీరియస్ అయ్యారు.