ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.సరిగ్గా తిరుపతి ఉప ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కి పాజిటివ్ రావటంతో ఈ వార్త అప్పట్లో రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.
తిరుపతి ఉప ఎన్నికల సమయంలో పాదయాత్ర చేసిన తర్వాత వ్యక్తిగత సిబ్బందికి కరోనా సోకడంతో వెంటనే ఐసోలేషన్ లోకి వెళ్ళిన పవన్ ఆ సమయంలో ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆస్పత్రిలో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ రావడం జరిగింది.
దీంతో కొన్ని వారాల పాటు హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకున్న పవన్ తాజాగా కరోనా నుండి పూర్తిగా కోలుకున్నట్లు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది.
ఇటీవల ఆర్టిపిసిఆర్ టెస్ట్ చేయడం జరిగింది అందులో పవన్ కి నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు ప్రకటనలో పార్టీ నాయకులు తెలిపారు.అయితే ఆరోగ్యరీత్యా అంతా బాగానే ఉన్న కొంత నీరసంగా పవన్ కి ఉన్నట్లు స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే తాను కోలుకోవాలని భగవంతునికి ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు.