తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కొత్త కేసులు పెరిగిపోతున్నాయి అని.
కాబట్టి పాక్షిక కర్ఫ్యూ విధించడం వల్ల ఉపయోగం ఏమీ లేదని అన్నారు.ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు.
ప్రజలు బయట తిరుగుతున్న నేపథ్యంలో వైరస్ కంట్రోల్ కావడం లేదని స్పష్టం చేశారు.వెంటనే రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్ డౌన్ పెట్టాల్సిందే అంటూ డిమాండ్ చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడాలంటే కచ్చితంగా లాక్ డౌన్ మాత్రమే ఏకైక మార్గమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వం ప్రతిపక్షాల నాయకులను నిర్వీర్యం చేయడానికి కేసులు పెడుతూ ఇబ్బందులపాలు చేస్తుందని అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏదిఏమైనా రాష్ట్రంలో వైరస్ తీవ్రత రోజురోజుకీ అధికంగా ఉందని వెంటనే ప్రభుత్వం లాక్ డౌన్ చేసే ఆలోచనలు చేసి ప్రజల ప్రాణాలను.కాపాడాలి లేకపోతే గాల్లో కలిసిపోతాయి అని సూచించారు.