తాజాగా రియల్ హీరో సోను సూద్ సోషల్ మీడియా ద్వారా తన ఎమోషనల్ ఫీలింగ్ ను తెలియజేశాడు.భారతదేశంలో కరోనా వైరస్ కు విజృంభిస్తున్న సమయం నుండి ఎంతోమందికి తన స్థోమతను మించి మనసుతో సాయం చేస్తున్న సంగతి మనం ప్రతి రోజూ చూస్తూనే ఉన్నాం.
ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ఆయన తాజాగా ఓ చిన్నారి మరణంతో చలించిపోయాడు.దీంతో ఆయన ఓ భావోద్వేగ ట్వీట్ చేశాడు.
ఇందులో భాగంగా భారతి, నాగపూర్ కి చెందిన అమ్మాయి.గత రాత్రి నాగపూర్ నుండి హైదరాబాద్ కు ఎయిర్ అంబులెన్స్ లో తీసుకొచ్చాను.
ఆ చిన్నారి నెల రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసి శుక్రవారం నాడు కన్నుమూసింది.కాబట్టి తాను వారి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తున్న అని.ఆమెని బతికిస్తా అనుకున్న కాకపోతే జీవితంలో ఏం జరుగుతుందో ఊహించలేము.ఈ సంఘటన నా హృదయాన్ని ముక్కలు చేసింది అంటూ ట్విట్టర్లో తెలియజేశాడు.
కరోనా బారిన పడిన అమ్మాయి తన మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నగరానికి ఎయిర్ అంబులెన్స్ లో తీసుకువచ్చారు.ఆయన కానీ ఆవిడ కన్నుమూయడం తనను కలిసి వేసిందని సోను సూద్ తెలిపాడు.
కరోనా దేశంలో చేస్తున్న సమయంలో సోను సూద్ ఎంతో మందికి ఆదుకునేందుకు నిర్విరామంగా పోరాడుతున్నాడు.మొదటిసారి దేశంలో కరోనా వైరస్ పై జరుగుతున్న సమయంలో సోనుసూద్ ఎంతోమంది కార్మికులను ఆయన కరోనా ఆసుపత్రిలో చేర్పించడం, అంతేకాకుండా చాలా మందిని వారి గమ్యస్థానాలకు చేరేందుకు ఎంతగానో సహకరించాడు.ప్రస్తుతం రెండోసారి కరోనా ఆస్పత్రులలో ఇబ్బందులకు గురవుతున్నా అనేకమంది రోగులకు ఆక్సిజన్ సిలిండర్లు అందించడం అలాగే మెడిసిన్స్ అవసరమైన చోట వాటిని ఇప్పించడం, ఆసుపత్రిలో చేర్పించడం లాంటి అనేక కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నాడు సోను సూద్.