తెలుగు ప్రేక్షకులు మెగా ఫ్యామిలీ నుండి వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన‘ సినిమా తో పరిచయం అయిన విషయం తెల్సిందే.ఉప్పెన సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో వైష్ణవ్ తేజ్ తదుపరి సినిమా లపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇప్పటికే వైష్ణవ్ తేజ్ రెండవ సినిమా క్రిష్ దర్శకత్వం లో రూపొందిన విషయం తెల్సిందే.కొండ పొలం నవల ఆధారంగా రూపొందిన ఈ సినిమా లో వైష్ణవ్ తేజ్ కు జోడీగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కొండ పొలం సినిమా ను ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.కేవలం నెలన్నర రోజుల్లోనే పూర్తి అయిన ఈ సినిమా ను మొదట థియేటర్ ల్లోనే విడుదల చేయాలనుకున్నాను.
జులై లేదా ఆగస్టు లో సినిమా ను విడుదల చేయాలని భావిస్తున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా మొత్తం తలకిందులు అయ్యింది.
థియేటర్లు ఎప్పటికి ఓపెన్ అయ్యేది తెలియడం లేదు.
మళ్లీ సినిమా లు థియేటర్లకు ఎప్పుడు వెళ్లిది క్లారిటీ లేదు.అందుకే కొండ పొలం సినిమా ను ఓటీటీ రిలీజ్ కు ఇచ్చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
క్రిష్ సన్నిహితులతో కలిసి ఈ సినిమా ను నిర్మించాడు.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా కు ప్రముఖ ఓటీటీ బిగ్ ఆఫర్ ఇచ్చిందట.
బడ్జెట్ కంటే దాదాపుగా 50 శాతం అదనంగా వస్తున్న నేపథ్యం లో సినిమా ను ఓటీటీ కి ఇచ్చేందుకు ఓకే చెప్పారని తెలుస్తోంది.ఉప్పెన క్రేజ్ తో వైష్ణవ్ తేజ్ మూవీ భారీ రేటు పలికింది.
ఖచ్చితంగా ఈ సినిమా విభిన్నంగా ఆకట్టుకునే విధంగా ఉంటుందనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.అందుకే ఈ సినిమా కు భారీ రేటు పెట్టేందుకు మేకర్స్ సిద్దం అయ్యారు.