కోలీవుడ్ లో స్టార్ హీరోలలో ఒకడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జయం రవి.నితిన్ జయం మూవీ రీమేక్ తో తమిళ్ లో హీరోగా తెరంగేట్రం చేశాడు.
తరువాత అమ్మా నాన్న తమిళమ్మాయి, నువ్వొస్తానంటే నేనొద్ధాంటానా, రెడీ రీమేక్ లతో తమిళ్ లో వరుస సక్సెస్ లు అందుకున్నాడు.ఆ తరువాత తని ఒరువన్ సినిమాతో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు.
ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ మూవీలో జయం రవి కీలక పాత్రలో నటిస్తున్నాడు.చివరిగా భూమి అనే సినిమాతో జయం రవి ఒటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.
ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యింది.రైతుల కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.
ఇదిలా ఉంటే కోలీవుడ్ హీరోలలో చాలా మంది ఇప్పటికే తెలుగు సినిమాఇండస్ట్రీలో కూడా తమకంటూ సొంత మార్కెట్ కలిగి ఉన్నారు.రజినీకాంత్, కమల్ హసన్, చియాన్ విక్రమ్, సూర్య, కార్తి లాంటి స్టార్స్ అందరూ కూడా తెలుగులో తమకంటూ కొంత మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు.
వారి సినిమాలు రిలీజ్ అయితే మంచి ఓపెనింగ్స్ వస్తాయి.ఇప్పుడిప్పుడే ఇళయదళపతి విజయ్ కూడా తెలుగులో హైప్ తెచ్చుకుంటున్నాడు.ఇక అతను స్ట్రైట్ తెలుగు సినిమాని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.మరో వైపు కార్తి ఇప్పటికే ఊపిరి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు.
సూర్య కూడా స్ట్రైట్ తెలుగు సినిమా కోసం కథలు వింటున్నాడు.ఈ నేపధ్యంలో జయం రవి కూడా తెలుగుకి తన మార్కెట్ విస్తరించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు.
పొన్నియన్ సెల్వన్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో ఎలాగూ ఇమేజ్ వస్తుంది.దీని తర్వాత స్ట్రైట్ తెలుగు సినిమా ఒకటి చేయాలని అనుకుంటున్నాడు.
ఇప్పటికే కథలు కూడా వింటున్నట్లు తెలుస్తుంది.జయం రవి తల్లి ఏపీకి చెందిన వ్యక్తి అనే విషయం తెలిసిందే.
అలాగే తండ్రి ఎడిటర్ మోహన్ కి కూడా టాలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉంది.ఈ నేపధ్యంలో తెలుగు మీద కొంత జయం రవికి కొంత పట్టునది.
ఈ నేపధ్యంలోనే స్ట్రైట్ తెలుగు సినిమా కోసం ప్లాన్ చేస్తున్నట్లు బోగట్టా.