టాలీవుడ్ సీనియర్ యాంకర్లు లాస్య రవి మళ్లీ కలిసి షోలు చేస్తూ వరుస ఆఫర్లతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.కామెడీ స్టార్స్ షోలో ఈ జోడీ చేస్తున్న స్కిట్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
సుధీర్ రష్మీ జోడీ కంటే ముందే మంచి పేరును సొంతం చేసుకున్న లాస్య రవి జోడీ సంథింగ్ స్పెషల్ ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ఆ తరువాత ఇతర టీవీ ఛానెళ్లలో సైతం రవిలాస్య కలిసి చేసిన షోలు ప్రసారమయ్యాయి.
అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ జోడీ మధ్య గొడవలు రావడం, విడిపోవడం జరిగింది.పెళ్లి తర్వాత లాస్య యూట్యూబ్ వీడియోలు చేస్తూ బిజీ కాగా రవి శ్రీముఖితో పటాస్ షో చేసి పాపులారిటిని మరింత పెంచుకున్నారు.
అయితే బిగ్ బాస్ సీజన్ 4లో లాస్య పాల్గొన్న తరువాత స్టార్ మా ఛానెల్ ప్రోగ్రామ్ లతో ఆమె మళ్లీ బిజీ అవుతున్నారు.ఈ ఏడాది సంక్రాంతి ఈవెంట్ లో లాస్య రవి కలిసి కనిపించగా ఈ జోడీ ఆ తరువాత కామెడీ స్టార్స్ షో ఈ జోడీకి మంచి పేరు తెచ్చిపెట్టింది.
బిగ్ బాస్ షో సీజన్ 4లో పాల్గొనడం వల్ల లాస్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది.రవితో కలిసి లాస్య చేస్తున్న స్కిట్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు రవిలాస్యలను అభిమానించే ఫ్యాన్స్ వీళ్ల స్కిట్ కోసమే కామెడీ స్టార్స్ షోను చూస్తున్నారు.
బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలకు స్పూఫ్ లు చేస్తూ ఈ జోడీ ప్రేక్షకులను అలరిస్తుండటం గమనార్హం.ఈ వారం ఈ జోడీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా స్పూఫ్ చేశారు.
రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు స్టార్ మా ఛానెల్ లో ఈ షో ప్రసారం కానుంది.యాంకర్ రవి ఎంట్రీ సీన్ లోనే లాస్యను గట్టిగా పట్టుకుని స్కిట్ హిట్ అయ్యేలా చేశారు.లాస్య, రవి రెచ్చిపోయి స్కిట్లు చేస్తూ మళ్లీ బిజీ అవుతుండటం గమనార్హం.