పుదుచ్చేరి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్. రంగస్వామి..!!

పుదుచ్చేరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ చీఫ్ రంగస్వామి కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు.దక్షిణ భారతదేశంలో అసెంబ్లీ తో కూడిన ఏకైక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

 Rangaswamy As Fourth Chief Minister Of Puducherry , N.rangaswamy, Puducherry, Bj-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికలలో ఎన్ఆర్ కాంగ్రెస్-బీజేపీ- అన్నాడిఎంకె కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.జరిగిన ఎన్నికలలో  ఎన్ఆర్సీకి 10 సీట్లు, బీజేపీకి 6 సీట్లు దక్కాయి.

ఇండిపెండెంట్లు 6 స్థానాల్లో, ప్రతిపక్ష డీఎంకేకు 6, కాంగ్రెస్ కు 2 సీట్లు దక్కాయి.దీంతో ఎన్ఆర్ కాంగ్రెస్ చీఫ్ ఎన్.రంగస్వామి .చేత ఇంచార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ఈ మధ్యాహ్నం రాజ్‌ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ పరిణామంతో పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి నాలుగోసారి పదవీ బాధ్యతలు చేపట్టినట్లు అయింది.కరోనా కారణంగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఉన్నత అధికారులు సీనియర్ నేతలు మాత్రమే హాజరయ్యారు.

అయితే సీఎం ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయగా.త్వరలో మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు నుండి అందుతున్న సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube