దేశంలో కరోనా డేంజర్ బెల్స్ భారీగా మోగుతున్న సంగతి తెలిసిందే.రోజుకి అధికారికంగా నాలుగు లక్షల కేసులు కొత్తగా నమోదవుతున్న అనధికారికంగా దానికి ఐదు రెట్లు ఉంటాయని.
మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.మరోపక్క వ్యాక్సినేషన్ కొరత భారీగా ఉంది.
దీంతో రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయా రాష్ట్రాల ప్రజలు తీవ్ర స్థాయిలో దేశవ్యాప్తంగా మండిపడుతున్నారు.ఇలాంటి తరుణంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రధాని మోడీ పై సోషల్ మీడియా సాక్షిగా మండిపడ్డారు.
వెంటనే ఏపీ సీఎం వైఎస్ జగన్ హేమంత్ సోరెన్ .చేసిన వ్యాఖ్యలకు స్వీట్ వార్నింగ్ తరహాలో కౌంటర్ ఇచ్చారు.
ఇటువంటి కష్ట సమయంలో కేంద్రానికి సహకరించాల్సిన టైం లో వేలెత్తి చూపడం సరైన విధానం కాదని తెలిపారు.రాజకీయాలు చేసే సమయం కాదని.ఆ విధంగా చేస్తే దేశం బలహీనమవుతుంది అంటూ హేమంత్ సోరెన్ కి జగన్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల రాష్ట్రాల పరిస్థితిపై పలు ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని జార్ఖండ్ సీఎం అదేవిధంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడటం జరిగింది.
ఆ తర్వాత వెంటనే కరోనా కట్టడి విషయంలో ప్రధాని మోడీ .ఏం చేయాలో చెప్పకుండా అన్న తరహాలో హేమంత్ సోరెన్ కామెంట్లు చేయడం జరిగింది.వెంటనే ఇటువంటి సమయంలో ఇలాంటివి కామెంట్లు ఏ మాత్రం దేశానికి మంచిది కాదు అంటూ జాతీయ దెబ్బతింటుంది అని జగన్ కౌంటర్ ఇచ్చారు.
.