దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.దాదాపు నాలుగు లక్షలకు పైగా రోజుకి కొత్త కేసులు బయటపడుతూ ఉండటంతో .
కరోనా బారిన పడిన రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇటువంటి తరుణంలో మరోపక్క బెడ్స్ లేక ఆక్సిజన్ కొరతతో చాలా మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
దాదాపు ప్రపంచంలో సగానికి పైగా కేసులు ఇండియాలోనే నమోదవుతున్నాయి.ఇటువంటి తరుణంలో కరోనా వ్యాప్తికి భయంకరంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.
మేటర్ లోకి వెళ్తే వర్క్ ఫ్రం హోం నుంచి పనిచేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.గర్భిణీ మహిళలు అదేవిధంగా వికలాంగ ఉద్యోగస్తుల ఖచ్చితంగా ఇంటినుంచే పనిచేసేలా కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ-డీఓపిటి ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేశారు.
అదేవిధంగా కంటోన్మెంట్ జోన్ లో ఉండే అధికారులు కూడా ఇంటి నుండే.విధులు నిర్వహించాలని తెలిపింది.తాజా ఆదేశాలు మే 31 వరకు అమలులో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది.
.