తెలంగాణ మంత్రులపై కాంగ్రెస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ?

తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి.ఇప్పటికే భూ ఆక్రమనల పై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్‌కు మద్దతు ఇస్తున్న వారంతా టీఆర్ఎస్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.

 Congress Leader Former Mla Sampath Sensational Comments On Telangana Ministers ,-TeluguStop.com

ఈ వివాదం టీఆర్ఎస్ కు ఒక కొరకరాని కొయ్యలా మారుతుందనే ప్రచారం కూడా జరుగుతుందట.

ఈ నేపధ్యంలో తెలంగాణ మంత్రుల పై కాంగ్రెస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే సంప‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అసలు తెలంగాణ రాష్ట్రం లో ప్రభుత్వ పాలన పడకేసిందంటూ, అధికార పార్టీ నేతలు తమ ఇష్టా రీతిగా భూకబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు.ఇంతటితో ఊరుకోకుండా చివరికి ద‌ళితుల‌, దేవుడి మాన్యాలను కూడా వదిలిపెట్టకుండా మంత్రులు ఆక్ర‌మించుకుంటున్నారని విమర్శించారు.

ఇకపోతే మంత్రి మ‌ల్లారెడ్డి భూ దందకు అడ్డేలేదని, దేవ‌ర‌యాంజ‌ల్ దేవుడి భూముల‌తో పాటుగా ఎన్నో భూ కబ్జాలు చేసాడని ఆరోపణలు వస్తున్నా ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవడం లేద‌ని సంప‌త్ మండిప‌డ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube