గత కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడిన ప్రముఖ మాఫియా డాన్ చోటా రాజన్ కరోనా కారణంగా మరణించారట.కాగా కరోనా బారిన పడిన చోటా రాజన్ ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో చోటా రాజన్ చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం ప్రాణాలు విడిచినట్లుగా సమాచారం.
ఇకపోతే ఏప్రిల్ 26న తీహార్ జైల్లో ఉన్న చోటా రాజన్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు ఎయిమ్స్ కు తరలించారు అలా సుమారుగా పదకొండు రోజుల నుండి చికిత్స అందుకుంటున్న చోటా రాజన్ నేర చరిత్ర ఈ రోజుతో అంతం అయ్యింది.
ఇదిలా ఉండగా 2015లో ఇండోనేషియాలో అరెస్ట్ చేసిన చోటా రాజన్ పై మహారాష్ట్ర లో 70కి పైగా క్రిమినల్ కేసులు నమోదైనాయని అధికారులు వెల్లడిస్తున్నారు.ఇక ఎంతటి గజరాజు అయినా చలిచీమల చేతికి చిక్కి చచ్చినట్లుగా మాఫియాడాన్ గా పేరు తెచ్చుకున్న చోటా రాజన్ చివరికి కరోనా అనే చిన్న వైరస్ దాటికి మరణించాడు.
విధి విచిత్రం అంటే ఇదే కావచ్చూ.