ఇప్పటివరకు మనం అమెజాన్ పే, పేటీఎం, ఫోన్ పే లాంటి విభిన్న డిజిటల్ పేమెంట్ ఫ్లాట్ఫామ్స్ ను మనం చూసాము.అయితే ఈ రంగంలోకి కొత్తగా బజాజ్ ఫైనాన్స్ తన సర్వీసులను మొదలుపెట్టబోతుంది.
అతి త్వరలోనే భారతదేశంలో బజాజ్ పే సేవలు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం.ఇందుకు సంబంధించి బజాజ్ ఫైనాన్స్ కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీపీఐ అనుమతులు కూడా ఇచ్చేసింది.
ఈ సందర్భంగా అతి త్వరలోనే బజాజ్ పే సంబంధించి కొత్త సేవలు భారతదేశంలోని ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయి.సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
ప్రస్తుతం ఉన్న పేటీఎం, ఫోన్ పే, అమెజాన్ లాగా బజాజ్ ఫైనాన్స్ కూడా ప్రీపెయిడ్ పేమెంట్ వ్యాపారంలోకి అడుగు పెట్టబోతోంది.దీంతో అతి త్వరలోనే బజాజ్ ఫైనాన్స్ తన బజాజ్ పే సర్వీసులను దేశంలో లాంచ్ చేయబోతోంది.
ఒకవేళ బజాజ్ పే సర్వీసులు దేశంలో మొదలైతే ప్రస్తుతం ఉన్న గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే, అమెజాన్ లాంటి ఆర్థిక లావాదేవీల డిజిటల్ ప్లాట్ ఫామ్లో పోటీని ఎదుర్కొని ముందుకు సాగాల్సి ఉంటుంది.
ఇకపోతే ఈ బజాజ్ పీపీఐ సర్వీసులను భారతదేశంలో శాశ్వతంగా కొనసాగించేందుకు ఆర్బిఐ బజాజ్ ఫైనాన్స్ నిర్వహించబోయే బజాజ్ పే సర్వీసులను శాశ్వతంగా కొనసాగించేందుకు ఆర్.బి.ఐ అన్ని అనుమతులను ఇచ్చేసింది.దీంతో ఇదివరకు లాగా ప్రతి ఏటా ఆర్బీఐ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి మొదలైతే వాటి సేవలు నిరంతరాయం కొనసాగించవచ్చు.దీంతో బజాజ్ ఫైనాన్స్ అతిత్వరలోనే పీపీఐ సర్వీసులను లాంచ్ చేయబోతోంది.
దీంతో ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్లయితే కస్టమర్లు వారి యూపీఐ ద్వారా నగదు లావాదేవీలు కొనసాగించవచ్చు.కేవలం ఆర్బీఐ నుండి మాత్రమే కాకుండా మిగతా అనుమతులు కూడా బజాజ్ ఫైనాన్స్ కు ఇప్పటికే అందినట్లు సమాచారం.