టైగర్ సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడుగా కెరియర్ స్టార్ట్ చేసిన డైరెక్టర్ విఐ ఆనంద్.మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ దర్శకుడు తరువాత సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ తీసుకొని అల్లు శిరీష్ తో ఒక్క క్షణం అనే సినిమా చేశాడు.
ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకొని అతనికి మంచి పేరు తీసుకొచ్చింది.తరువాత ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో ఆత్మ కాన్సెప్ట్ కి సైన్స్ ని కనెక్ట్ చేసి మరో ప్రయోగాత్మక పాయింట్ ని తెరపై ప్రేమ కథతో ఆవిష్కరించి సూపర్ హిట్ కొట్టాడు.
డిఫరెంట్ పాయింట్స్ ని ట్రెండ్ కి కనెక్ట్ అయ్యే విధంగా చెప్పడంతో విఐ ఆనంద్ కి మంచి గుర్తింపు వచ్చింది.దీంతో ఏకంగా మాస్ మహారాజ్ రవితేజతో డిస్కో రాజా సినిమా చేసే ఛాన్స్ వచ్చింది.
ఈ సినిమాలో కూడా ఒక సైన్స్ ఎలిమెంట్ ని తీసుకొని రవితేజని డ్యూయల్ లో లో ప్రెజెంట్ చేసి కమర్షియల్ ఫార్మాట్ లో కథని చెప్పే ప్రయత్నం చేశాడు.
అయితే నేరేషన్ లో లోపాలు వలన సినిమా డిజాస్టర్ అయ్యింది.
దీంతో ఈ దర్శకుడు ఇమేజ్ మళ్ళీ మొదటికి వచ్చింది.డిస్కో రాజా ఫ్లాప్ తో నెక్స్ట్ సినిమా కోసం చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది.
మళ్ళీ తాజాగా తనకి మొదటి సినిమా అవకాశం ఇచ్చిన సందీప్ కిషన్ తో తన స్టైల్ లో సూపర్ నేచురల్ కాన్సెప్ట్ తోనే సినిమాని తెరకెక్కించబోతున్నాడు.తాజాగా ఈ సినిమాని సందీప్ కిషన్ పుట్టిన రోజు సందర్భంగా అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.
ఇక కరోనా సిచువేషన్ నార్మల్ అయిన తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తామని పోస్టర్ లో పేర్కొన్నారు.మరి ఈ సినిమాతో ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడేమో అనేది చూడాలి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సందీప్ కిషన్ గల్లీ రౌడీ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయిపొయింది.