స్టార్ మా లో ప్రసారం అవుతున్న గృహలక్ష్మి సీరియల్ నటి కస్తూరీ శంకర్ గురించి అందరికీ తెలిసిందే.ఈ సీరియల్స్ ద్వారా ఆమె బాగా గుర్తింపు పొందింది.
అంతేకాకుండా ఈమె అప్పట్లో వెండితెరపై హీరోయిన్ గా కూడా బాగా మెప్పించింది.ఇక ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.
అప్పుడప్పుడు ఆమె చేసే కౌంటర్ ల వల్ల బాగా వైరల్ గా మారుతుంది.
ఇదిలా ఉంటే రాజకీయ విషయాలలో కూడా బాగా పట్టుతో ఉంటుంది.
ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకులను బాగా తన స్టైల్ లో విమర్శిస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఘటన పై స్పందించింది కస్తూరి.
బెంగాల్లో ఎన్నికల తర్వాత జరుగుతున్న హింస గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అక్కడ జరిగే అల్లర్లు సోషల్ మీడియా వేదికగా బాగా వైరల్ గా మారుతున్నాయి.
ఇక పశ్చిమ మిడ్నాపూర్ లో కేంద్రమంత్రి మురళీధరన్ పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కొందరు దుండగులు.సహాయ మంత్రి కాన్వాయ్ పై రాళ్లతో, కర్రలతో దాడి చేయగా.ఇక ఈ విషయం గురించి ఎంతో కోపంగా స్పందించింది కస్తూరీ.కేంద్ర మంత్రి కే ఇలా జరుగుతుంటే.మామూలు జనాల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది.
ఎంతో సెక్యూరిటీ తో ఉండే మంత్రికి ఇలా జరిగితే.అతని కింద ఉన్న వారి పరిస్థితులు ఎందో.
ఇలాంటి ఊహించుకోలేక పోతున్నాను అంటూ.వారు మనుషులేనా? గూండా రాజ్యం లా కనిపిస్తుందంటూ. ఆమె ట్విట్టర్ లో ఈ విషయం గురించి ఆగ్రహంతో ట్వీట్ చేసింది.ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.