ఈ హైటెక్ యుగంలో ప్రపంచాన్ని ఇంతలా స్దంభించిపోయేలా చేసిన కరోనా వైరస్ మానవ మేధస్సుకు ఒక ప్రశ్నలా మారిందనడంలో సందేహం లేదు.దీని వల్ల దేశంలో, ప్రజల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
ఇప్పటికే ప్రార్ధన మందిరాలు, ప్రభుత్వ సంస్దలు మొదలగు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఊహించని విధంగా మార్పులు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం కోవిడ్ తీవ్రంగా విజృంభిస్తున్న నేపధ్యం లో వారానికి ఐదు రోజులు మాత్రమే ఎల్ఐసీ కార్యాలయాలు పనిచేయనున్నట్లు ప్రకటించింది.కాగా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు మాత్రమే ఎల్ఐసీ కార్యాలయాలు పనిచేయనున్నట్లు వెల్లడించింది.ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 15 నే ఈ విషయాన్ని నోటిఫై చేయగా, తాజాగా దీన్ని మే 10 నుంచి అమల్లోకి తేనున్నట్లు ఎల్ఐసీ కార్యలయ వర్గాలు ప్రకటించాయి.