తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజుకో ట్విస్ట్ ఇస్తున్నాయి.ఇప్పటికే పొలిటికల్ వార్లో భూములకు సంబంధించిన పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటెల రాజేందర్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో హట్ టాపిక్గా మారింది.
అసలు ఈటలను పార్టీ నుండి బయటకు పంపించే వ్యవహారంలో ఎన్నో కీలక పరిణామాలు గుట్టుచప్పుడు కాకుండా జరిగాయని ప్రచారం జరుగుతుండగా ఇక ఈటల కూడా తర్వాత వేసే అడుగులు ఏంటనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది.మరి ఈటల పొలిటికల్ మైలేజీ అమాంతంగా పెరుగుతుందా లేదా అనేది ఒక ప్రశ్నగానే మిగిలింది.
ఇదిలా ఉండగా శామీర్పేటలోని ఈటెల రాజేందర్ నివాసంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు.కాగా చేవెళ్ల ఎంపీగా 2018లో పోటీచేసి ఓడిపోయిన కొండా అప్పటి నుంచి కాంగ్రెస్కు దూరంగానే ఉంటున్నారు.
అదీగాక అప్పటి నుంచి ఆయన భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించలేదు.ఈ క్రమంలో సొంతంగా పార్టీపెడతారని వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ఈటలను కలవడం వెనక ఇదే అంశం ఉందని ప్రచారం జరుగుతుంది.కానీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాత్రం ఈ భేటీకి రాజకీయపరమైన కారణాలేమీ లేవని, ఈటల భార్య జమున తమకు బంధువని, అందుకే కేవలం సానుభూతితో మాత్రమే ఆయనను కలవడానికి వచ్చానని వెల్లడించారు.