ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఎన్నో మంది కుటుంబాలలో విషాదాలను నింపుతోంది.అయితే ఇది ఒక్క సామాన్యులనే కబలిస్తుందనుకుంటే పొరపాటు.
ఇది ఒక్క రంగం అని కాదు అన్ని రకాల రంగాలలోని వ్యక్తులను కబలిస్తోంది.ఇక ఎన్నో కుటుంబాలు ఇంటి పెద్దను, ఎదిగిన కొడుకులను కోల్పోయి గర్భశోకంతో విలవిలాలాడుతున్న పరిస్థితి ఉంది.
అయితే ఇప్పుడు వినాశక కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన తమ సన్నిహిత కుటుంబాలకు ఏదో ఒక రూపంలో అండగా ఉంటూ కొంత బాసటగా నిలుస్తున్నారు.ఇప్పటికే ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ తన కీబోర్డ్ ప్లేయర్ అయిన కమల్ కుమార్ కరోనా బారిన పడి మరణించడంతో అతనిది నిరుపేద కుటుంబం కావడంతో.
కుటుంబానికి కొంత ఆర్థికంగా అండగా నిలబడడమే కాకుండా, తన కొడుకును సైతం చదివించడానికి ముందుకొచ్చిన పరిస్థితి ఉంది.అయితే తాజాగా ఈ జాబితాలో నటుడు సప్తగిరి కూడా చేరడం విశేషం.
ప్రముఖ రచయిత నంద్యాల రవి కోవిడ్ తో బాధపడి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందినా విధి వక్రించడంతో మరణించడం జరిగింది.అయితే రచయిత నంద్యాల రవి కుటుంబానికి నటుడు సప్తగిరి అండగా నిలిచి మానవత్వం చాటుకున్నాడు.
నంద్యాల రవి కుటుంబానికి లక్ష రూపాయలను సహాయం చేసి ఆర్థికంగా అండగా నిలిచాడు.ఇంతటి గొప్ప పని చేసిన సప్తగిరిని నెటిజన్లు అభినందిస్తున్నారు.