ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మృత్యుఘంటికలు మొగిస్తోంది.మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ లో మరణాలు అధికంగా నమోదవుతూ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తోంది.
అయితే ఇప్పటికే కోవిడ్ దెబ్బకు ఆధికారికంగా ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించకున్నా ప్రజలే స్వచ్చందంగా లాక్ డౌన్ విధించుకుంటూ తమ గ్రామాన్ని, తమ పట్టణాన్ని కరోనా బారి నుండి రక్షించుకోవడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు.అయితే ఇంత కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో ప్రజలు మానసికంగా కొంత నెగెటివిటీ ఉన్న సమయంలో కొంత ఉపశమనం కలిగించింది ఏదైనా ఉంది అంటే అది ఐపీఎల్ అని చెప్పవచ్చు.
మొదట్లో కొంత మంది క్రికెటర్ లకు కరోనా సోకినా ఐపీఎల్ ను యధావిధిగా కొనసాగించారు.
కాని తాజాగా ఒకే టీం లో నలుగురు క్రికెటర్ లకు కరోనా సోకడంతో ఐపీఎల్ ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ఆ తరువాత అందరూ క్రికెటర్ లు తమ ఇళ్లకు చేరుకున్నారు.కాని కోహ్లీ మాత్రం బెంగుళూరు నుండి అహ్మదాబాద్ వెళ్ళి కోవిడ్ బాధితులకు తన వంతుగా ఆక్సీజన్ విషయంలో గాని ఇతర విషయాల్లో సహాయం చేస్తూ స్వయంగా తానే సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు.
ఇప్పటికే సీఎం సహాయ నిధికి తన వంతుగా విరాళం కూడా ప్రకటించాడు.ఇంతటి కష్ట కాలంలో తన వంతు పాత్రను పోషిస్తున్నందుకు కోహ్లీని నెటిజన్లు ప్రశంసలలో ముంచెత్తుతున్నారు.