తెలంగాణలో మాజీ మంత్రి ఈటెల వ్యవహారం రాజకీయంగా రచ్చగా మారింది.అయితే కేసీఆర్ పై మాటల తూటాలు పేలుస్తూ రాజకీయాలను హీటేక్కిస్తున్నాడు ఈటెల రాజేందర్.
అయితే కేసీఆర్ రకరకాల వ్యూహాలతో ఈటెలను టార్గెట్ చేస్తున్నా, ఈటెల కేసీఆర్ వ్యూహానికి ప్రతివ్యూహం వేస్తున్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాత్రం ఈ విషయంపై స్పందించకుండా మౌనం వహిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఇటీవల కోవిడ్ బారిన పడి హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న కేటీఆర్ కొంచెం అస్వస్థతగా ఉండడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు.
అయితే ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న కేటీఆర్ ఈ పరిణామాలను ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతున్నదనే పరిణామాలను నిషితంగా గమనిస్తున్నాడు.ప్రస్తుతం కేసీఆర్ డైరెక్షన్ లో ఇది నడుస్తుండడం వల్ల కేటీఆర్ ఈ విషయంలో కలగజసుకోవడానికి ఇష్టపడడం లేనట్టు తెలుస్తోంది.
ఈటెల ను టీఆర్ఎస్ ముఖ్య నేతలను రంగంలోకి దింపి ఈటెలను నియోజకవర్గానికే పరిమితం చేసేలా, ఆ తరువాత నియోజకవర్గంలో బలం తగ్గించేలా కేసీఆర్ బలమైన వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది.కేసీఆర్ వ్యూహానికి మరి ఈటెల ఎటువంటి ప్రతివ్యూహం రచించి బదులిస్తాడో చూడాల్సి ఉంది.
అయితే ఈటెల వ్యవహారం ఇంకాస్త ముదిరితే కేటీఆర్ స్పందదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.