యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ప్రభాస్ రాధా కృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.
ఈ సినిమాను యువీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్నారు.
ఈ సినిమా రీ షూట్ కు సిద్ధం అయ్యిందని ఇప్పటికే పలు పుకార్లు వచ్చాయి.
ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేయడానికి ఈ చిత్ర యూనిట్ సిద్ధం అయ్యిందని ప్రచారం జోరుగా జరిగింది.
అయితే ఈ రీ షూట్ విషయం నిజం కాదని యువీ క్రియషన్స్ నుండి అందుతున్న సమాచారం.ఈ సినిమా పీరియాడిక్ సినిమా కావడం వల్ల వీఎఫ్ ఎక్స్ వర్క్ ఎక్కువుగా ఉందని సమాచారం.
ఈ సినిమాను రెండు మూడు వారాల్లో పూర్తి చేయాలనీ భావించిన కరోనా కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది.
ఈ సినిమా గత సంవత్సరమే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.
ఈ సంవత్సరం జులై లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన కరోనా కారణంగా మల్లి వాయిదా పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ సినిమాను ఎలాగైనా పూర్తి చేసి ఈ సంవత్సరంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ గట్టి పట్టుదలతో ఉందట.
దీంతో పాటు ప్రభాస్ సలార్, ఆది పురుష్ సినిమాలు కూడా ప్రారంభించేసారు.సలార్ సినిమాను కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను ఉగ్రం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది.
ఆదిపురుష్ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు.