తెలుగుదేశం పార్టీ కీలక నాయకుడు దూళిపాళ్ల నరేంద్ర ని ఎసిబి అధికారులు సంఘం అనేది కేసు విషయంలో విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే.దీనిలో భాగంగా విచారణ నిమిత్తం ధూళిపాల నరేంద్ర అదేవిధంగా సహకార శాఖ మాజీ అధికారి గురునాథానికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ కోవిడ్ పాజిటివ్ రిపోర్టు రావడం జరిగింది.
దీంతో ఇరు కుటుంబాలకు చెందిన వారు వెంటనే విజయవాడలో చికిత్స అందించాలని కోరటంతో.ఏసీబీ అధికారులు వారిని ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేస్తున్నారు.
ఈ విషయంలో హైకోర్టు స్పందించి అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రిలో వారిద్దరికీ చికిత్స అందించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
కోర్టు ఇచ్చిన ఆదేశాలు బేఖాతరు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరించింది.
మరోపక్క పిటిషనర్ల బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టులో విచారణ చేయడానికి.హైకోర్టు క్వాష్ పిటిషన్ పెద్ద అడ్డంకి కాదని స్పష్టం చేసింది.
ఈ పిటిషన్ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.సంగం డైరీ లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ధూళిపాల నరేంద్ర నీ ఏసీబీ పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే.
అయితే ఈ అరెస్టు కేవలం రాజకీయ కక్షతోనే ప్రభుత్వం చేస్తున్న టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.ఇలాంటి తరుణంలో ధూళిపాల నరేంద్ర కోవిడ్ పాజిటివ్ రావటంతో.
టిడిపి నేతలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
.