కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రజలు కరోనా బారిన పడి మరణించడం జరిగింది.
అందుకు భారతదేశం కూడా ఏమీ అతీతమేమీ కాదు.ప్రస్తుతం భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ పడగలు విప్పుతోంది.
కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు మనుషులు పిట్టల్లా రాలుతున్న పరిస్థితి ఉంది.ప్రస్తుతం కరోనా సోకిన వారు సోషల్ మీడియా ప్రభావంతో మరింత ఆందోళన చెందుతుండడం వల్ల కరోనా మరణాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి.
అయితే మొదటి దఫా కరోనా వేవ్ సమయంలో లాక్ డౌన్ సమయంలో అన్ని రకాల వర్గాలు ఉపాధి కొరకు ఇబ్బంది పడ్డాయి.
కాని అత్యంత దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొన్నది మాత్రం వలస కార్మికులనే చెప్పాలి.
పొట్ట కూటి కోసం తమ ఇల్లు, వాకిలిని వదిలి ఉపాధి కోసం వచ్చిన వలస కార్మికులు ఇక ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కరువై చేసేది ఏమీ లేక కాలి నడకన తమ స్వంత ఊళ్లకు పిల్లాజెల్లాతో కలిసి పయనమ య్యారు.అయితే ఆ సమయంలో వలస కార్మికులను స్వంత ఖర్చులతో బస్సులు ఏర్పాటు చేసి వారి పాలిట దేవుడిగా మారారు నటుడు సోనూసూద్.
ఇక అప్పటి నుండి ఎవ్వరికి ఎలాంటి సహాయం అవసరం ఉన్నా తనకున్న శక్తి మేరకు సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.ఇక రకరకాల సమస్యల పరిష్కారానికి కోట్ల రూపాయలు దానం చేస్తున్న ఆస్తులు ఎంత అని చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది.
అయితే ఓ ఇంటర్నేషనల్ వెబ్ సైట్ సర్వే పరంగా చూస్తే సోనూసూద్ ఆస్తులు 140కోట్ల రూపాయలుగా తెలుస్తోంది.